చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-01-21T06:34:32+05:30 IST

స్థల వివాదంలో మనస్థాపం చెందిన అక్కా, తమ్ముడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా బుధవారం చికిత్స పొందుతూ తమ్ముడు మృతిచెందాడు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

రాయవరం, జనవరి 20: స్థల వివాదంలో మనస్థాపం చెందిన అక్కా, తమ్ముడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా బుధవారం చికిత్స పొందుతూ తమ్ముడు మృతిచెందాడు.  పసలపూడి న్యూకాలనీకి చెందిన పసుపులేటి రాణికి అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తికి స్థల వివాదం ఉంది.  ఈనేపథ్యంలో ఆ స్థలం తమకు దక్కకుండా పోతుందనే ఆందోళనకు గురైన రాణి, ఆమె తమ్ముడు అనకాపల్లి రాజు ఈనెల 19న  పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వారిని రామచంద్రపురం ఆసుపత్రికి తరలించగా  మెరుగైన చికిత్స కోసం కాకినాడ తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం రాజు మృతిచెందాడు.  ఆ స్థలం ప్రస్తుతం రెవెన్యూ అధికారుల ఆధీనంలో ఉంది.


Updated Date - 2021-01-21T06:34:32+05:30 IST