అప్పటివరకు డీజే ముందు ఆడుకున్న రెండేళ్ల బాలుడు సడన్‌గా అదృశ్యం.. చివరకు అక్కడ అలా కనిపించడంతో..

ABN , First Publish Date - 2021-12-01T21:48:46+05:30 IST

ఆ బాలుడి వయసు రెండేళ్లు. తల్లిదండ్రులతో కలిసి హుషారుగా బంధువుల పెళ్లికి వెళ్లాడు. అక్కడ పెళ్లి తర్వాత జరిగే బరాత్ కార్యక్రమానికి డీజే ఏర్పాటు చేశారు. ఆ బాబు డీజే ముందు

అప్పటివరకు డీజే ముందు ఆడుకున్న రెండేళ్ల బాలుడు సడన్‌గా అదృశ్యం.. చివరకు అక్కడ అలా కనిపించడంతో..

లక్నో: ఆ బాలుడి వయసు రెండేళ్లు. తల్లిదండ్రులతో కలిసి హుషారుగా బంధువుల పెళ్లికి వెళ్లాడు. అక్కడ పెళ్లి తర్వాత జరిగే బరాత్ కార్యక్రమానికి డీజే ఏర్పాటు చేశారు. ఆ బాబు డీజే ముందు స్టెప్పులు వేస్తూ.. ఆడుకుంటూ అప్పటివరకు అక్కడే ఉన్నాడు. కుమారుడిని గమనిస్తూ పక్కనే పని చేసుకుంటున్న తల్లిదండ్రులకు సడన్‌గా బాలుడు కనిపించలేదు. దీంతో కంగారుగా చుట్టుపక్కల అంతా వెతికారు. అయితే చివరకు బాలుడు అక్కడ అలా కనిపించడంతో అంతా షాకయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. పూర్తి వివరాల్లోకెళ్తే..


షాబాద్ సిటీ మోహల్లా ఖేద ప్రాంతానికి చెందిన రత్నేష్ రాథోర్ అల్హాపూర్ తిరహ ప్రాంతంలో జరుగుతున్న బంధువుల వివాహానికి భార్య, రెండేళ్ల కొడుకు శివంతో వెళ్లాడు. అయితే పెళ్లి జరిగిన తర్వాత బరాత్ కార్యక్రమానికి అక్కడ డీజే ఏర్పాటు చేశారు. శివం డీజే పాటలకు హుషారుగా స్టెప్పులు వేస్తూ.. అక్కడే ఆడుకుంటున్నాడు. తల్లిదండ్రులు కొడుకును గమనిస్తూనే వేరే పని చేసుకుంటున్నారు. అయితే కొద్దిసేపటికే డీజే ముందు శివం కనిపించలేదు. వారు కంగారుపడుతూనే చుట్టుపక్కల అంతా వెతికారు. అయినా ప్రయోజనం లేకపోయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.


వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఫంక్షన్ హాల్ మొత్తం గాలించారు. అపుడు సెకండ్ ఫ్లోర్‌లోని తలుపులు మూసి ఉన్న గదిలో ఓ వ్యక్తి దగ్గర బాలుడు అపస్మారక స్థితిలో కనిపించాడు. పోలీసులు అతడిని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. బాలుడిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించిన అతడిని స్థానికులు ఆవేశంతో చితకబాదారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.


Updated Date - 2021-12-01T21:48:46+05:30 IST