చైనాలో దారుణం.. 37 మంది విద్యార్థులపై కత్తితో దాడి.. నిందితుడి అరెస్టు

ABN , First Publish Date - 2020-06-04T23:47:50+05:30 IST

చైనాలో దారుణం చోటుచేసుకుంది. ముక్కుపచ్చలారని 37 మంది చిన్నారులపై ఓ దుర్మార్గుడు అత్యంత....

చైనాలో దారుణం.. 37 మంది విద్యార్థులపై కత్తితో దాడి.. నిందితుడి అరెస్టు

బీజింగ్: చైనాలో దారుణం చోటుచేసుకుంది. ముక్కుపచ్చలారని 37 మంది చిన్నారులపై  ఓ దుర్మార్గుడు అత్యంత పాశవికంగా కత్తితో దాడి చేసి గాయపర్చాడు. వారితో పాటు మరో ఇద్దరు సిబ్బందిని తీవ్రంగా గాయపర్చాడు. ఈ సంఘటన ఝువాంగ్ ప్రాంతంలోని కాంగ్వూ కౌంటీలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. దీనిపై అక్కడి పత్రికల్లో ప్రచురితమైన సమాచారం మేరకు.. దుండగుడు అదే పాఠశాలలో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. అయితే అతడు దాడిచేయడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. దాడి సమచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 39 మందిని ఆసుపత్రికి తరలించారు. చిన్నారులకు సాధారణ గాయాలే అయినప్పటికీ.. సిబ్బందికి మాత్రం తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.


పాఠశాలలోని చిన్నారులందరూ 6 నుంచి 12 సంవత్సరాల మధ్య వయసు కలవారని, తమచుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే వారిపై దుండగుడు దాడికి దిగాడని, దీంతో అందరూ భయంతో ఏడ్చేశారని సిబ్బంది చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల చైనాలో కత్తిదాడులు ఎక్కువైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా స్కూళ్లలో చిన్నారులపై ఈ దాడులు ఎక్కువగా జరుగుతున్నట్లు సమాచారం.

Updated Date - 2020-06-04T23:47:50+05:30 IST