ధరూర్ క్యాంప్లోనే మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలి
ABN , First Publish Date - 2021-08-02T06:57:35+05:30 IST
జగిత్యాల జిల్లాకు మంజూరైన మెడికల్ కళాశాలను ధరూర్ క్యాంపులోనే ఏర్పాటు చేయాలని కోరుతూ మున్నూ రు కాపు సంఘ ప్రతినిధులు ఎమ్మెల్యే సంజయ్ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
జగిత్యాల అర్బన్, ఆగష్టు 1: జగిత్యాల జిల్లాకు మంజూరైన మెడికల్ కళాశాలను ధరూర్ క్యాంపులోనే ఏర్పాటు చేయాలని కోరుతూ మున్నూ రు కాపు సంఘ ప్రతినిధులు ఎమ్మెల్యే సంజయ్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. పట్టణ ప్రజలందరి సౌకర్యం దృష్టిలో ఉంచుకుని జిల్లా కేంద్రంలోనే మెడికల్ కళాశాల ఏర్పాటు చేసేలా చొరవ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి బం డారి రాజ్కుమార్, పట్టణ అధ్యక్షుడు రంగు గోపాల్, వర్తక సంఘ అధ్య క్షుడు దీటి అంజయ్య, యూత్ అధ్యక్షుడు కూతరు శేఖర్, కౌన్సిలర్లు తో ట మల్లిఖార్జున్, చుక్క నవీన్, బండారి రజిని నరేంధర్, కొలగాని ప్రేమలత సత్యం, పిట్ట ధర్మరాజు, రామాలయ ఛైర్మెన్ కాశెట్టి తిరుపతి, నా యకులు తదితరులున్నారు.
ప్రహరీ నిర్మాణం కోసం
పట్టణంలోని శంఖుల పల్లె ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ప్రహరీ నిర్మాణం చేపట్టాలని కోరుతూ స్థానిక 15 వార్డు కౌన్సిలర్ మల్లిఖార్జున్ ఎమ్మెల్యే సంజయ్కుమార్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కాం పౌండ్ వాల్, గేటు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.
అలాగే అంగన్వాడీ భవనం కోసం నిఽధులు మంజూరు చేయాలని కో రగా ఎమ్మెల్యే సంజయ్ సానుకూలంగా స్నం దించారు.