వ్యాను ఢీకొని వృద్ధుడి మృతి

ABN , First Publish Date - 2021-01-21T06:33:27+05:30 IST

సైకిలుపై వెళ్తున్న వృద్ధుడిని వ్యాను ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు.

వ్యాను ఢీకొని వృద్ధుడి మృతి

కాజులూరు, జనవరి 20: సైకిలుపై వెళ్తున్న వృద్ధుడిని వ్యాను ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి... కాజులూరుకు చెందిన డి.సూర్యనారాయణ (65) దుగ్గుదుర్రులోని ఓ రైస్‌మిల్లులో రోజువారీ కూలీగా పని చేస్తున్నాడు. కాగా బుధవారం మధ్యాహ్నం భోజనానికి వెళ్లి తిరిగి సైకిలుపై మిల్లుకు వెళ్తుండగా వైఎస్సార్‌ జంక్షన్‌ వద్దకు వచ్చేసరికి మహేంద్ర వ్యాను వెనుక నుంచి ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన అతడిని 108 అంబులెన్సులో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. వ్యాను డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గొల్లపాలెం ఎస్‌ఐ పవన్‌కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2021-01-21T06:33:27+05:30 IST