పట్టణంలో వరుస చోరీలు
ABN , First Publish Date - 2021-11-28T05:49:16+05:30 IST
స్థానిక వినాయక జంక్షన్ వద్ద జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న షాపుల్లో వరుస చోరీలు జరుగుతు న్నాయి.
గజపతినగరం, నవంబరు 27: స్థానిక వినాయక జంక్షన్ వద్ద జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న షాపుల్లో వరుస చోరీలు జరుగుతు న్నాయి. శుక్రవారం తెల్లవారుజాము న సాయికుమార్ పాన్షాపులో చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ సంఘటన మరవకముందే శని వారం ఆదే వరుసలో హోల్సేల్ షాపులో చోరీ జరగడంతో వ్యాపారులతో పాటు స్థానికులు భయాందోళన చెందుతున్నారు. పచ్చికోళ్ల గురునాథం హోల్సేల్ షా పులో పై రేకులు కట్ చేసి దుండగులు రూ.15వేలు విలువ చేసే సిగరెట్ ప్యాకెట్లు, సుమారు రూ.2వేలు నగదు అపహరించుకు పోయినట్టు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజులు వరుస చోరీలు జరగడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. గతంలో చోరీలకు పాల్పడినవారి వివరాలను సేకరిస్తున్నారు.