రాత్రిపూట ఇంట్లో చోరీ.. అల్లుడిని తప్ప అందరికీ తీవ్రంగా కొట్టిన దొంగలు.. పోలీసులకు డౌట్.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!

ABN , First Publish Date - 2021-12-28T18:15:26+05:30 IST

అతను ఒక మార్బుల్ వ్యాపారి.. వ్యాపారం విజయవంతంగా సాగుతుండడంతో బాగా సంపాదించాడు..

రాత్రిపూట ఇంట్లో చోరీ.. అల్లుడిని తప్ప అందరికీ తీవ్రంగా కొట్టిన దొంగలు.. పోలీసులకు డౌట్.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!

అతను ఒక మార్బుల్ వ్యాపారి.. వ్యాపారం విజయవంతంగా సాగుతుండడంతో బాగా సంపాదించాడు.. ఇటీవల అతని ఇంట్లో దొంగతనం జరిగింది.. బలమైన తాళాలను సునాయాసంగా తీసేసిన దొంగలు ఇంట్లోకి ప్రవేశించారు.. అందరినీ తాళ్లతో కట్టేశారు.. ఆ ఇంట్లో ఉన్న ఓ కుర్రాడిని తప్ప మిగతా అందరినీ కొట్టారు.. నేరుగా బెడ్రూమ్‌లోకి వెళ్లి బంగారం, నగలు పట్టుకెళ్లిపోయారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తాజాగా షాకింగ్ విషయం బయటపెట్టారు.. ఆ ఇంట్లోని కుర్రాడే ఈ దొంగతనంలో కీలక పాత్రధారి అని తేల్చారు.


రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు చెందిన సంజయ్ అనే వ్యక్తి ఇంట్లో గత నెలలో దొంగతనం జరిగింది. మొత్తం తలుపులన్నీ లాక్ చేసి ఉన్న ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు కుటుంబ సభ్యులందరినీ తాళ్లతో కట్టేశారు. సంజయ్ మేనల్లుడిని తప్ప మిగతా అందరినీ చితక్కొట్టారు. అనంతరం బెడ్రూమ్‌లో నగలు, బంగారం ఉంచే లాకర్ ఓపెన్ చేసి పట్టుకెళ్లిపోయారు. తర్వాతి రోజు ఉదయం దొంగతనం గురించి సమాచారం అందుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. కొన్ని రోజులకు వారికి సంజయ్ మేనల్లుడి మీద అనుమానం వచ్చింది. మిగత అందరికీ గట్టి దెబ్బలు తగలగా, సంజయ్ మేనల్లుడు మాత్రం బాగానే ఉన్నాడు. 


అలాగే దొంగలకు ఆ ఇంటికి సంబంధించిన పూర్తి సమాచారం ఎవరో లోపలి వ్యక్తే ఇచ్చినట్టు పోలీసులు అనుమానించారు. దీంతో మైనర్ అయిన సంజయ్ మేనల్లుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. తన నలుగురు స్నేహితులతో కలిసి ఆ కుర్రాడే ఆ దొంగతనం చేయించినట్టు తేలింది. రాజస్థాన్‌లో వివిధ ప్రాంతాల్లో ఉన్న నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైనర్ అయిన సంజయ్ మేనల్లుడిని జువైనల్ హోమ్‌కు తరలించారు.  

Updated Date - 2021-12-28T18:15:26+05:30 IST