రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దేవానంద్కు ఘన నివాళి
ABN , First Publish Date - 2022-01-25T04:35:39+05:30 IST
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దేవానంద్కు సోమవారం జిల్లా అధికారులు ఘనంగా నివాళులర్పించారు.
చెన్నూరు, జనవరి 24 : రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దేవానంద్కు సోమవారం జిల్లా అధికారులు ఘనంగా నివాళులర్పించారు. దేవానంద్ కొంతకాలంగా వెన్నెముక వ్యాధితో హైదరాబాద్లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని మండల పరిధిలోని కనపర్తి గ్రామానికి తరలించారు. అక్కడి ఎస్టేటల్లో అంత్యక్రియలు నిర్వహించారు. కలెక్టర్ విజయరామరాజు ఆదేశాల మేరకు కడప ఆర్డీవో ధర్మచంద్రారెడ్డి దేవానంద్ మృతదేహాన్ని సందర్శించి పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అనంతరం ఆయన భార్య టీఎల్ సుజాత, కుమారుడు ప్రశాంత్ ఆనంద్, కుమార్తె దయానలను పరామర్శించారు. కాగా దేవానంద్ 1955 జనవరి 26న అనంతపురం జిల్లాలో జన్మించారు. కడపలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్లో పీజీ పూర్తి చేశారు. మొదట ఐఏఎస్ పంజాబ్ క్యాడర్తో ఆయన ప్రస్థానం మొదలైంది. ప్రకాశం జిల్లా కలెక్టర్గా, ఏపీ స్టేట్ హౌసింగ్బోర్డు ఎండీగా పనిచేశారు.