జిల్లా అంతటా రెపరెపలాడిన త్రివర్ణపతాకం
ABN , First Publish Date - 2021-01-27T06:32:29+05:30 IST
మండల కేంద్రంలో మంగళవారం గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించారు.
ఖానాపూర్, జనవరి 26 : మండల కేంద్రంలో మంగళవారం గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అబ్దుల్మోయిద్, మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏఎంసీ చైర్మన్ కడార్ల గంగనర్సయ్య, పీఏసీఎస్ కార్యాలయంలో చైర్మన్ ఇప్ప సత్యనారాయణరెడ్డి, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ నరెందర్, సర్కిల్ కార్యాలయంలో సీఐ శ్రీధర్, వ్యవసాయాధికారి కార్యాలయంలో ఏడిఏ ఇబ్రహింఅనీఫ్, ఎఫ్డివో కార్యాలయంలో ఎఫ్డివో కోటేశ్వర్రావు, ప్రెస్భవన్లో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాండ్ల రాజశేఖర్, రాజీవ్చౌక్లో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు దొనికెని దయానంద్, తె లంగాణ చౌక్లో టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షులు తాళ్ళఫెల్లి రాజగంగన్న, జగన్నాథ్ చౌక్లో బిజేపి పట్టణాధ్యక్షులు సంతోష్, పాటు ఆయా కుల సంఘాలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆయా సంఘాల అధ్య క్షులు జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. రక్ష డిఫెన్స్ అకాడమి ఆధ్వర్యంలో యువకులు పట్టణంలో భారీర్యాలీ నిర్వహించారు. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో చిన్నారులు లేని లోటు కనిపించింది. పాఠశాలలు మూసి ఉండడంతో చిన్నారుల శోభయాత్రలు లేక బోసిపోయినట్లు కనిపించిన పట్టణ పురవీధుల్లో రక్ష డిఫెన్స్ అకాడమి యువకులు నిర్వహించిన శోభాయాత్రతో తిరిగి కళను సంతరించుకుంది.
భైంసా, జనవరి 26 : రెవెన్యూ డివిజన్ కేంద్రమైన భైంసాతో పాటు డివిజన్ పరిధిలోని ఆయా గ్రామాల్లో మంగళవారం గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. భైంసాలోని ఏరియా ఆసుపత్రిలో ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, మున్సిపల్ కార్యాలయంలో కమీషనర్ ఎం..ఎ.ఖదీర్ , వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మెన్ పిప్పెర కృష్ణ, కాంగ్రేస్ పార్టీ కార్యా లయంలో డీసీసీ అద్యక్షులు పవార్ రాంరావ్ పటేల్, బీజేపీ కార్యాలయంలో పార్టీ పట్టణ కమిటీ అద్యక్షుడు బాలాజీ సూత్రావే, టీఅర్ఎస్ పార్టీ కార్యా లయంలో పట్టణ పార్టీ ప్రతినిధి ఫారుఖ్లు జాతీయ జెండాను ఎగురవేసారు. ఆయా ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో సంబంధిత కార్యాలయాల ఇన్చార్జీలు, బాధ్యులు జాతీయ జెండాను ఎగురవేసారు.
భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో...
నిర్మల్టౌన్, జనవరి 26 : నిర్మల్ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో 72వ గణతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణాధ్యక్షులు సాధం అరవింద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ గీతాన్ని అలపించారు. అనంతరం మిఠాయిలు పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు అయ్యన్న గారి భూమయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసెమ్మ రాజు, జిల్లా యువ మోర్చ అధ్యక్షులు ఓడిసెల అర్జున్, పట్టణ ప్రధాన కార్యదర్శి అల్లం భాస్కర్, శ్రీరామోజు నరేష్, ఆడెపు సుధాకర్, పంతికే ప్రకాష్, శ్రావణ్, దిలీఫ్, భరత్ తదితరులున్నారు.
తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో..
72వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఎన్టీఆర్ విగ్రహం వద్ద భారత గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. పార్టీ అధ్యక్షుడు సిరికొండ రమేష్ జాతీయజెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మామడ మండల అధ్యక్షుడు షేక్ మౌలానా, సోన్ మండల అధ్యక్షుడు బైరి వెంకన్న, కిషన్, రహిమత్, తదితరులు పాల్గొన్నారు.
ఎంఐఎం పతాకావిష్కరణ
జిల్లా ఎంఐఎం నాయకులు గణతంత్ర దినోత్సవ సందర్భంగా పతాకావిష్కరణ చేశారు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అజీంబిన్ యాహియా, కౌన్సిలర్లు మజ్హర్, ముజాహిద్ అలీ, సయ్యద్ అబ్రార్, తదితర నాయకులు పాల్గొన్నారు.