తిరగబడిన ట్రక్కు... రూ. 70 లక్షల విలువైన ఫోన్లు ఎత్తుకెళ్లిన జనం!
ABN , First Publish Date - 2021-06-16T16:18:16+05:30 IST
మహారాష్ట్రలోని ఉస్మానాబాద్లో ఒక ట్రక్కు తిరగబడడంతో...
ఉస్మానాబాద్: మహారాష్ట్రలోని ఉస్మానాబాద్లో ఒక ట్రక్కు తిరగబడడంతో అక్కడున్న జనం ఆ ట్రక్కులోని రూ. 70 లక్షలు విలువచేసే ఫోన్లను ఎత్తుకెళ్లిపోయారు. ఈ ఉదంతం గురించి ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ ఈ ఘటన వాషి తహసీల్ పరిధిలోని షోలాపూర్-ఔరంగాబాద్ హైవేపై చోటుచేసుకున్నదని తెలిపారు. లూటీకి గురైన ట్రక్కులో మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఎల్ఈడీలు, బొమ్మలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయని ఆయన తెలిపారు.
ఆ రోడ్డు మీదుగా వెళుతున్నవారితో పాటు గ్రామస్తులు ఆ వస్తువులను ఎత్తుకెళ్లిపోయారు. మరికొందరు కంటైనర్ తలుపును ధ్వసంచేసి మరీ విలువైన వస్తువులను లూటీ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసుల విజ్ఞప్తితో కొందరు వారు తీసుకున్న వస్తువులను తిరిగి అప్పగించారు. మరికొందరు వస్తువులను తిరిగి ఇవ్వలేదన్నారు. వారు ఆ వస్తువులను తిరిగి ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు.