ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ద్విచక్ర వాహనం

ABN , First Publish Date - 2021-01-18T05:12:05+05:30 IST

మండలంలోని పాల్వంచ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదం లో కామారెడ్డి మండలం ఉగ్రవాయి గ్రామ వీఆర్‌ఏ రాజశేఖర్‌(28) మృతి చెందగా మరో వ్యక్తి పరిస్థి తి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు.

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ద్విచక్ర వాహనం

వీఆర్‌ఏ రాజశేఖర్‌ మృతి, మరొకరి పరిస్థితి విషమం
కామారెడ్డి, జనవరి 17: మండలంలోని పాల్వంచ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదం లో కామారెడ్డి మండలం ఉగ్రవాయి గ్రామ వీఆర్‌ఏ రాజశేఖర్‌(28) మృతి చెందగా మరో వ్యక్తి పరిస్థి తి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. స్థానికు లు తెలిపిన వివరాల ప్రకారం.. మాచారెడ్డి మండలం నుంచి ద్విచక్రవాహనంపై ప్రయాణి స్తున్న వీఆర్‌ఏ రాజశేఖర్‌, ప్రమోద్‌ అనే వ్యక్తులు ఆగిఉన్న లారీని వెనుకభాగం నుంచి ఢీకొట్టడంతో వీఆర్‌ఏ రాజశేఖర్‌ అక్కడిక్కడే మృతి చెందాడు. ప్రమోద్‌ను కామా రెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. సంఘటనపై కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-01-18T05:12:05+05:30 IST