వసతి గృహం సందర్శన

ABN , First Publish Date - 2021-01-17T04:52:55+05:30 IST

పట్టణంలోని సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న బాలుర వసతి గృహాన్ని ఆ శాఖ ఉప సంచాలకులు సునీల్‌రాజ్‌కుమార్‌ శనివారం సందర్శించారు.

వసతి గృహం సందర్శన
వసతి గృహ పరిసరాల్ని పరిశీలిస్తున్న డీడీ సునీల్‌రాజ్‌కుమార్‌

చీపురుపల్లి, జనవరి 16: పట్టణంలోని సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న బాలుర వసతి గృహాన్ని ఆ శాఖ ఉప సంచాలకులు సునీల్‌రాజ్‌కుమార్‌ శనివారం సందర్శించారు. సంక్రాంతి సెలవుల అనంతరం వసతి గృహానికి హాజరయ్యే విద్యార్థులకు ఏ ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. అన్ని సౌకర్యాలు సక్రమంగా ఉన్నాయా లేదా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.  అనంతరం తాగునీరు, మరుగుదొడ్ల పనితీరు పరిశీ లించారు. కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  ఆయన వెంట హెచ్‌డబ్ల్యూవో మంగళగిరి శ్రీనివాసరావు, పంచాయతీ ఈవో జి.వేణుగోపాల్‌ ఉన్నారు.

 

Updated Date - 2021-01-17T04:52:55+05:30 IST