తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
ABN , First Publish Date - 2020-08-04T09:44:58+05:30 IST
తెలంగాణ రాష్ట్ర సాధనకు ఎంతో కృషి చేసిన ఉద్యమకారులకు అన్ని విధాలుగా న్యాయం జరిగేలా తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ
బర్కత్పుర, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర సాధనకు ఎంతో కృషి చేసిన ఉద్యమకారులకు అన్ని విధాలుగా న్యాయం జరిగేలా తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఉద్యమకారుల ఫోరం డిమాండ్ చేసింది. ఈ మేరకు సీఎం కేసీఆర్కు లేఖ రాసినట్లు సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫోరం చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్, కన్వీనర్ గొల్లపల్లి నాగరాజు, కో-ఆర్డినేటర్ గోలి సమ్మిరెడ్డి, గౌరవ చైర్మన్ బి.ముత్తయ్య తెలిపారు.