సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
ABN , First Publish Date - 2020-10-25T11:18:14+05:30 IST
అర్హులైన ఆటో కార్మికులందరికీ ప్రభ్తుత్వం ఇంటి స్థలా లు మంజూరు చేసి ఆటోనగర్ ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ పట్టణ అధ్య క్ష, కార్యదర్శులు నాగేష్..
బద్వేలు, అక్టోబరు 24: అర్హులైన ఆటో కార్మికులందరికీ ప్రభ్తుత్వం ఇంటి స్థలా లు మంజూరు చేసి ఆటోనగర్ ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ పట్టణ అధ్య క్ష, కార్యదర్శులు నాగేష్, నరసింహులు డిమాండ్ చేశారు. స్థానిక జేవీ భవన్ లో నిర్వహించిన సమావేశంలో ఏఐటీయూసీ అనుబంధ ఆటో యూనియన్ సభ్యులకు గుర్తింపు కార్డులు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ పట్టణంలో సమారు రెండు వేలకు పైగా ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారన్నారు. వారిలో అనేక మంది అనేక వారు చదువుకున్న వారు ఉన్నా కనీసం ఇంటి బాడుగలు కట్టుకోలేని దుస్థితిలో ఉన్నారన్నారు. ప్రభుత్వ ఇళ్ల స్థలాల పథకంలో భాగంగా వారందరినీ అర్హులుగా చేర్చి ఇండ్లు నిర్మించి ఇచ్చి ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆటోవర్కర్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు వెంకట మురళి, బాబు ఆటో వర్కర్స్ నాయకులు గోపి, చిన్న చెన్నయ్య, సుబ్బరాయుడు, తదితర ఆటో కార్మికులు పాల్గొన్నారు.