ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి

ABN , First Publish Date - 2021-01-16T06:33:11+05:30 IST

ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఎమ్మార్పీఎస్‌టీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివా్‌సమాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి
కరపత్రం ఆవిష్కరిస్తున్న శ్రీనివాస్‌

యాదాద్రి రూరల్‌, జనవరి 15: ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని  ఎమ్మార్పీఎస్‌టీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివా్‌సమాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. స్థానిక అంబేద్కర్‌ విగ్రహానికి పూలవేసి, సబ్‌ప్లాన్‌ సాధనలో భాగంగా ఈ నెల 28, 29 తేదీల్లో కలెక్టరేట్ల ఎదుట దీక్షల కరపత్రాన్ని ుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో దళితుల ఆర్థిక సామాజిక అభివృద్ధికి ఎస్సీ కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారని, అయినప్పటికీ నిధులు సరైన పద్ధతిలో అందకపోవడంతో ఇప్పటి వరకు దళితులు వెనకబాటుకు గురవుతూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జనాభా నిష్పతి ప్రకారంగా నిధులు విడుదల చేసి, అభివృద్ధికి కృషి చేయాలని, నిధులపై శ్వేతపత్రం విడుదల డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ టిఎస్‌ నాయకులు మీసాల స్వామి, ముడుగుల రాములు, పెరమాండ్ల రాములు, ఎర్ర విజయ్‌మాదిగ, కోట స్వామి పాల్గొన్నారు.

Updated Date - 2021-01-16T06:33:11+05:30 IST