బైక్‌ నుంచి పడి మహిళ మృతి

ABN , First Publish Date - 2021-10-22T05:53:57+05:30 IST

కోరుకొండ మండలం బొల్లెద్దుపాలేనికి చెందిన పానంపూడి సునీత (29) భర్త జయకుమార్‌తో కలిసి రావులపాలెం నుంచి రాజమహేంద్రవరం వైపు మోటారు సైకిలుపై వెళ్తోంది.

బైక్‌ నుంచి పడి మహిళ మృతి

ఆలమూరు, అక్టోబరు 21: కోరుకొండ మండలం బొల్లెద్దుపాలేనికి చెందిన పానంపూడి సునీత (29) భర్త జయకుమార్‌తో కలిసి రావులపాలెం నుంచి రాజమహేంద్రవరం వైపు  మోటారు సైకిలుపై వెళ్తోంది. జొన్నాడ వద్ద బైక్‌పై నుంచి పడిపోవడంతో సునీత తలకి తీవ్ర గాయమైంది. ఆమెను ఆలమూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్టు గుర్తించారు. ఆల మూరు పోలీసులు కేసు  దర్యాప్తు చేస్తున్నారు. 



Updated Date - 2021-10-22T05:53:57+05:30 IST