భర్తపై ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-01-21T05:35:09+05:30 IST

మండల కేంద్రానికి చెందిన నాగమణి తన భర్త మద్దిపల్లె కిరణ్‌కుమార్‌ అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని బుధవారం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

భర్తపై ఫిర్యాదు

ఉయ్యాలవాడ, జనవరి 20: మండల కేంద్రానికి చెందిన నాగమణి తన భర్త మద్దిపల్లె కిరణ్‌కుమార్‌ అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని బుధవారం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 2020 ఫిబ్రవరిలో తమ వివాహమైందని, కొన్ని నెలలుగా భర్త అదనపు కట్నం కోసం తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ మల్లికార్జున తెలిపారు. 


Updated Date - 2021-01-21T05:35:09+05:30 IST