పదేళ్ల క్రితం పెళ్లి.. భర్తకు విడాకులు ఇచ్చిన నాలుగు నెలల తర్వాత సడన్‌గా భార్య అదృశ్యం.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-01-24T20:20:30+05:30 IST

ఆమెకు పదేళ్ల క్రితమే పెళ్లైంది. విడాకుల కోసం కొన్ని నెలలుగా భర్త పట్టుపడుతుండటంతో ఓకే చెప్పింది. భర్త కోరినట్టే అతడికి నాలుగు నెలల క్రితం విడాకులు ఇచ్చింది. తర్వాత ఆమె సడన్‌గా

పదేళ్ల క్రితం పెళ్లి.. భర్తకు విడాకులు ఇచ్చిన నాలుగు నెలల తర్వాత సడన్‌గా భార్య అదృశ్యం.. అసలేం జరిగిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: ఆమెకు పదేళ్ల క్రితమే పెళ్లైంది. విడాకుల కోసం కొన్ని నెలలుగా భర్త పట్టుపడుతుండటంతో ఓకే చెప్పింది. భర్త కోరినట్టే అతడికి నాలుగు నెలల క్రితం విడాకులు ఇచ్చింది. తర్వాత ఆమె సడన్‌గా అదృశ్యం అయింది. కాగా.. ఆమె తన భర్తకు విడాకులు ఇవ్వడానికి గల కారణం ఏంటి? విడాకులు ఇచ్చిన తర్వాత ఆమె ఏం చేసింది? అనే పూర్తి వివరాల్లోకి వెళితే..



హర్యానాలోని రోహ్తక్‌కు చెందిన మహిళకు సుమారు 10 సంవత్సరాల క్రితం ఓ వ్యక్తితో పెళ్లైంది. విహహం జరిగిన కొత్తలో ఆ దంపతులు అనోన్యంగానే ఉన్నారు. కానీ ఆ తర్వాత వారి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టకపోవడంతో ఆ భార్యభర్తల మధ్య దూరం పెరిగింది. ఈ క్రమంలోనే విడాకుల కోసం భర్త పట్టుబట్టాడు. అతడి కోరిక ప్రకారం నాలుగు నెలల క్రితం ఆమె తన భర్తకు విడాకులు ఇచ్చేసింది. ఆ తర్వాత తన సోదరితో కలిసి ఉంటోంది. ఈ నేపథ్యంలోనే గత సోమవారం నుంచి ఆమె అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. దీంతో అదే రోజు సాయంత్రం డ్యూటీ నుంచి తిరిగొచ్చిన ఆమె సోదరి.. తన భర్తతో కలిసి చుట్టుపక్కల గాలించింది. బంధువులకు ఫోన్ చేసి విచారించింది. అయినా ఫలితం లేకపోవడంతో తాజాగా పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 




Updated Date - 2022-01-24T20:20:30+05:30 IST