విద్యుదాఘాతంతో టైల్స్వర్కర్ మృతి
ABN , First Publish Date - 2021-10-23T06:01:59+05:30 IST
టైల్స్వర్క్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతిచెందాడు.
ముమ్మిడివరం, అక్టోబరు 22: టైల్స్వర్క్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతిచెందాడు. ముమ్మిడివరం నగర పంచాయతీ రెడ్డివారిపాలేనికి చెందిన రెడ్డి సురేష్(21) శుక్రవారం సాయంత్రం నగర పంచాయతీ మట్టాడిపాలెంలో ఓ ఇంట్లో టైల్స్ పనిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. రెడ్డి మహేష్, పార్వతి దంపతుల రెండో కుమారుడు సురేష్. ఇటీవలే డిగ్రీ పూర్తయింది. టైల్స్ పనిచేస్తూ సురేష్ చదువుకునేవాడు. ఇతను బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా. సురేష్ మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.