పెట్రోల్ బాటిల్తో యువకుడి హల్చల్
ABN , First Publish Date - 2020-07-17T11:37:47+05:30 IST
రామచంద్రాపురం గ్రామ సచివాలయం వద్ద ఇళ్ల స్థలం కోసం బోయ సురేష్ అనే యువకుడు పెట్రోల్ బాటిల్తో ..
కిర్లంపూడి, జూలై 16: రామచంద్రాపురం గ్రామ సచివాలయం వద్ద ఇళ్ల స్థలం కోసం బోయ సురేష్ అనే యువకుడు పెట్రోల్ బాటిల్తో హల్చల్ చేశాడు. నాయకులు, అధికారులు తనకు స్థలం రానివ్వలేదని అన్నారు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో ఉద్యోగులు ఆందోళన చెందారు. తాను ఆటో నడుపుకుని జీవిస్తున్నానని ఇంటి స్థలం కోసం సంవత్సరాలుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో గ్రామ రెవెన్యూ అధికారి సురేష్ మాట్లాడుతూ అర్హత ఉంటే ఇంటి స్థలం వచ్చేలా చేస్తామని హామీ ఇవ్వడంతో యువకుడు శాంతించాడు.