ప్రేమికుల రోజున పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన యువతి.. ఏం జరిగిందంటే..!

ABN , First Publish Date - 2020-02-15T00:11:07+05:30 IST

ప్రేమిస్తున్నానన్నాడు.. పెళ్లి కూడా చేసుకుంటానన్నాడు. ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడు. పలుమార్లు అత్యాచారానికి తెగబడ్డాడు

ప్రేమికుల రోజున పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన యువతి.. ఏం జరిగిందంటే..!

హైదరాబాద్: ప్రేమిస్తున్నానన్నాడు.. పెళ్లి కూడా చేసుకుంటానన్నాడు. ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడు. పలుమార్లు అత్యాచారానికి తెగబడ్డాడు. తీరా పెళ్లి మాటెత్తేసరికి ముఖం చాటేశాడు. ప్రేమికుల దినోత్సవాన్ని ప్రేమికులంతా సంతోషంగా జరుపుకుంటుంటే.. ప్రియుడి చేతిలో మోసపోయిన ప్రియురాలి మాత్రం పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది.


వివరాల్లోకి వెళ్తే..

ఒడిశాకు చెందిన శ్రీకాంత్‌రౌత్ 9 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వలస వచ్చాడు. బాలానగర్‌లోని రంగారెడ్డినగర్‌లో నివాసం ఉంటున్నాడు. స్థానికంగా ఉన్న ఓ పరిశ్రమలో పని చేస్తున్నాడు. అదే పరిశ్రమలో పని చేస్తున్న ఓ యువతితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త వారి మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమగా మారింది. పెళ్లి మాటెత్తేసరికి ప్రియుడు నిరాకరించడంతో మోసపోయానని తెలుసుకున్న యువతి బాలానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు పేర్కొంది. గత తొమ్మిదేళ్లుగా తాము ప్రేమించుకున్నామని పోలీసులకు యువతి వివరించింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు... కేసు నమోదు చేసుకుని శ్రీకాంత్‌‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2020-02-15T00:11:07+05:30 IST