కొమురంభీంలో అటవీశాఖ సిబ్బందికి సవాల్గా మారిన ఏ2 పులి
ABN , First Publish Date - 2021-02-27T13:25:44+05:30 IST
జిల్లాలో అటవీశాఖకు ఏ2 పులి సవాల్ గా మారింది. ఏ2 మరో ఆడపులితో కలిసి తిరుగుతోంది. తాజాగా బెజ్జూరు మండలంలోని కుంటలమానేపల్లి శివారులో..
కొమురంభీం: జిల్లాలో అటవీశాఖకు ఏ2 పులి సవాల్ గా మారింది. ఏ2 మరో ఆడపులితో కలిసి తిరుగుతోంది. తాజాగా బెజ్జూరు మండలంలోని కుంటలమానేపల్లి శివారులో తెల్లవారుజామున రెండు పశువులపై దాడి చేసి హతమార్చింది. పులల దాడులతో అక్కడి ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు. ఈ రెండు పులలను పట్టుకునేందుకు అటవీ సిబ్బంది ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. 20 మంది సిబ్బందితో కలిసి ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేసుకుని పులల కోసం అటవీ సిబ్బంది అధికారులు గాలిస్తున్నారు.