ఆధార్‌ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2021-06-22T03:04:03+05:30 IST

గ్రామ సచివాలయాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఆధార్‌ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఉదయగిరి ఏఎంసీ చైర్మన్‌ షేక్‌.

ఆధార్‌ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఏఎంసీ చైర్మన్‌ అలీఅహమ్మద్‌


వరికుంటపాడు, జూన్‌ 21: గ్రామ సచివాలయాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఆధార్‌ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఉదయగిరి ఏఎంసీ చైర్మన్‌ షేక్‌. అలీఅహమ్మద్‌ అన్నారు. సోమవారం రామాపురం సచివాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆధార్‌ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. మారుమూల ప్రాంత ప్రజలకు ఇలాంటి అవకాశం కల్పించడం ఎంతో అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో సురేష్‌బాబు, రావిళ్ళ. నాగేంద్ర, సర్పంచ్‌ ఆరెకొండ. పెంచలమ్మ, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-22T03:04:03+05:30 IST