ఆదివాసీలకు మౌలిక సదుపాయాలు కల్పించాలి

ABN , First Publish Date - 2020-12-04T05:39:29+05:30 IST

జి.మాడుగుల మండలంలోని మారుమూల గ్రామాల్లో నివాసం ఉంటున్న ఆదివాసీలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్స డిమాండ్‌ చేశారు.

ఆదివాసీలకు మౌలిక సదుపాయాలు కల్పించాలి
వసమామిడిలో ర్యాలీ చేపట్టిన మారుమూల గ్రామాల గిరిజనులు.

వసమామిడిలో ర్యాలీ 

పాడేరురూరల్‌, డిసెంబరు 3: జి.మాడుగుల మండలంలోని మారుమూల గ్రామాల్లో నివాసం ఉంటున్న ఆదివాసీలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్స డిమాండ్‌ చేశారు. గురువారం వసమామిడిలో 15 గ్రామాల ప్రజలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పలనర్స మాట్లాడుతూ.. మారుమూల 15 గ్రామాల్లో ఆదివాసీలకు ఎటువంటి సౌకర్యాలు లేక అల్లాడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి, ప్రభుత్వాధికారులు స్పందించి ఆదివాసీలకు మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు జగ్గందొర, జీనబందు, కె.భానుప్రకాష్‌, కె.రాజశేఖర్‌, 400 మంది ఆదివాసీలు పాల్గొన్నారు.

 

Updated Date - 2020-12-04T05:39:29+05:30 IST