ఆదివాసీలకు మౌలిక సదుపాయాలు కల్పించాలి
ABN , First Publish Date - 2020-12-04T05:39:29+05:30 IST
జి.మాడుగుల మండలంలోని మారుమూల గ్రామాల్లో నివాసం ఉంటున్న ఆదివాసీలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్స డిమాండ్ చేశారు.
వసమామిడిలో ర్యాలీ
పాడేరురూరల్, డిసెంబరు 3: జి.మాడుగుల మండలంలోని మారుమూల గ్రామాల్లో నివాసం ఉంటున్న ఆదివాసీలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్స డిమాండ్ చేశారు. గురువారం వసమామిడిలో 15 గ్రామాల ప్రజలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పలనర్స మాట్లాడుతూ.. మారుమూల 15 గ్రామాల్లో ఆదివాసీలకు ఎటువంటి సౌకర్యాలు లేక అల్లాడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి, ప్రభుత్వాధికారులు స్పందించి ఆదివాసీలకు మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు జగ్గందొర, జీనబందు, కె.భానుప్రకాష్, కె.రాజశేఖర్, 400 మంది ఆదివాసీలు పాల్గొన్నారు.