రిజిస్ట్రేషన్‌ విలువపై ఆస్తి పన్ను దారుణం

ABN , First Publish Date - 2020-12-04T06:02:57+05:30 IST

కరోనా పరిస్థితుల్లో ప్రస్తుత పన్నులు చెల్లించటమే కష్టంగా మారిన తరుణంలో రిజిస్ట్రేషన్‌ విలువపై ఆస్తి పన్ను శోచనీయమని అవగాహన సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి తెలిపారు.

రిజిస్ట్రేషన్‌ విలువపై ఆస్తి పన్ను దారుణం
సమావేశంలో మాట్లాడుతున్న కొండా శివరామిరెడ్డి తదితరులు

గుంటూరు, డిసెంబరు 3: కరోనా పరిస్థితుల్లో ప్రస్తుత పన్నులు చెల్లించటమే కష్టంగా మారిన తరుణంలో రిజిస్ట్రేషన్‌ విలువపై ఆస్తి పన్ను శోచనీయమని అవగాహన సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి తెలిపారు. రిజిస్ట్రేషన్‌ విలువపై ఆస్తి పన్ను బిల్లు ఆమోదాన్ని నిరసిస్తూ గురువారం అరండల్‌పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో గృహ యజమానులతో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. పన్నుల్లో రాయితీలు ఇవ్వాల్సిన ప్రభుత్వాలు ప్రజలపై భారాలు వేయటం దారుణమన్నారు. ప్రభుత్వ తాజా విధానంతో పన్ను అనేక రెట్లు పెరుగుతందని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో సిటీ హౌస్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి పీఎస్‌ మూర్తి, మురళీకృష్ణ, సదాశివం, వెంకటేశ్వరరావు తదితరులున్నారు. 


Updated Date - 2020-12-04T06:02:57+05:30 IST