సీఎస్‌కు ఏబీ వెంకటేశ్వరరావు లేఖ

ABN , First Publish Date - 2021-04-10T18:45:54+05:30 IST

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌కు ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు లేఖ రాశారు. సీబీఐతో తన కేసు దర్యాప్తు చేయించాలని ఏబీ వెంకటేశ్వరరావు కోరారు.

సీఎస్‌కు ఏబీ వెంకటేశ్వరరావు లేఖ

అమరావతి: ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌కు ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు లేఖ రాశారు. సీబీఐతో తన కేసు దర్యాప్తు చేయించాలని ఏబీ వెంకటేశ్వరరావు కోరారు. తన ఆరోపణలను రుజువు చేసే 9 పత్రాలను లేఖకు జోడించారు. డీజీపీ తన స్వహస్తాలతో ఫోర్జరీ చేసినట్టు ఆధారాలను లేఖకు జత చేశారు. డీజీ సవాంగ్, సీఐడీ అదనపు డీజీపీ సునీల్ కుమార్, ఏసీబీ డీజీ సీతారామాంజనేయులు, ఇంటెలిజెన్స్ అధికారులు, మరికొందరి ప్రమేయానికి సంబంధించిన పత్రాలు అందజేశారు. ఏబీవీ లేఖతో సచివాలయంలో కలకలం రేగింది. తనపై ఎంక్వయిరీస్ కమిషనర్ జరిపిన విచారణ సందర్భంగా దొంగ డాక్యుమెంట్లను సమర్పించారని గతంలోనే ఏబీవీ ఆరోపించారు. సీబీఐతో విచారణకు ప్రభుత్వం సిద్ధంగా లేకపోతే కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. 


ఫోర్జరీలు, దొంగ డాక్యుమెంట్లతో ప్రభుత్వాన్ని కొందరు పోలీస్ అధికారులు తప్పుదారి పట్టించిన తీరును 1994లో జరిగిన నంబి నారాయణన్ ఉదంతంతో పోల్చారు. నంబి నారాయణన్ కేసులో అప్పటి డీజీపీ, ఇంటలిజెన్స్ బ్యూరో జాయింట్ డైరెక్టర్‌పై ఆరోపణలు ఉన్నాయి. సుప్రీమ్ కోర్టు జోక్యంతో ఇప్పటికీ ఆ కేసులో విచారణ కొనసాగుతోంది. తప్పుడు కేసు బనాయించినందుకు గానూ నంబి నారాయణ్‌కు కోటి 30 లక్షల రూపాయల పరిహారాన్ని కేరళ ప్రభుత్వం చెల్లించాల్సి వచ్చింది. తన కేసులో కూడా సీబీఐ విచారణతో పాటు, పరిహారం కోరుతూ కోర్టు తలుపులు తట్టే ఆలోచనలో ఏబీవీ ఉన్నారు.

Updated Date - 2021-04-10T18:45:54+05:30 IST