అబ్దుల్ కలామ్ సోదరుడు కన్నుమూత

ABN , First Publish Date - 2021-03-08T04:12:40+05:30 IST

మరైకర్ మరణంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు, తమిళ, ఇంగ్లీషు భాషల్లో తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. అబ్దుల్ కలామ్‌తో ఆయన తీసుకున్న ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ

అబ్దుల్ కలామ్ సోదరుడు కన్నుమూత

చెన్నై: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ సోదరుడు (అన్నయ్య) ఏపీజే మహ్మద్ ముతు మీర మరైకర్ కన్నుమూశారు. 104 ఏళ్ల ఆయన ఆదివారం తన స్వగృహంలోనే కన్నుమూసినట్లు మనవడు షేక్ సలీమ్ తెలిపారు. కొంత కాలం క్రితం కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయన తన 104వ పుట్టిన రోజు జరుపుకున్నారు. మరైకర్ భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం ఆయన నివాసంలో ఉంచారు. సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.


కాగా, మరైకర్ కన్నుమూతపై తెలంగాణ గవర్నర్ తమిళిసై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు, తమిళ, ఇంగ్లీషు భాషల్లో తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. అబ్దుల్ కలామ్‌తో ఆయన తీసుకున్న ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘‘భారత రత్న డాక్టర్ అబ్దుల్ కలామ్ గారి అన్న మహ్మద్ ముతు మీర మరైకర్ గారి మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి.వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’’ అని తెలుగులో రాసుకొచ్చారు.



Updated Date - 2021-03-08T04:12:40+05:30 IST