అబ్దుల్ కలాం సేవలు చిరస్మరణీయం
ABN , First Publish Date - 2020-10-16T06:04:30+05:30 IST
భారతదేశానికి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అందించిన సేవలు చిరస్మరణీయమని జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు
మంథని, అక్టోబర్ 15: భారతదేశానికి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అందించిన సేవలు చిరస్మరణీయమని జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు కొనియాడారు. గురువారం అబ్దుల్కలాం జయంతి ని పురస్కరించుకొని స్థానిక క్యాంపు కార్యాలయం లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘ నంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ, కలాం ఒక శాస్త్రవేత్తగా దేశానికి ఎన్నో రక్షణ ఆయుధాలు, క్షిపణులు, మిస్సైల్స్ త యారు చేయడంలో ప్రముఖ పాత్ర పోషించారని పేర్కొన్నారు. రాష్ట్రపతిగా ఆ పదవికే వన్నె తెచ్చారన్నారు. యువత సైతం ఆయనను ఆదర్శంగా తీ సుకొని ముందుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొండ శంకర్, జడ్పీటీసీ తగరం సుమలత శంకర్లాల్, పీఏసీఎస్ చైర్మన్ కొ త్త శ్రీనివాస్, నాయకులు వీకే రవి, శ్రీనివాస్, గర్రెపల్లి సత్యనారాయణ, బత్తుల సత్యనారాయణ, ఆ కుల కిరణ్, గొబ్బురు వంశీ ఉన్నారు.