అభిమన్యు సెంచరీ: భారత్‌ ‘ఎ’ 308/4

ABN , First Publish Date - 2021-11-26T10:15:45+05:30 IST

అభిమన్యు ఈశ్వరన్‌ (103) శతకంతో రాణించడంతో.. సౌతాఫ్రికా-ఎతో తొలి అనధికారిక టెస్ట్‌లో భారత్‌-ఎ భారీస్కోరు దిశగా సాగుతోంది.

అభిమన్యు సెంచరీ: భారత్‌ ‘ఎ’ 308/4

బ్లూమ్‌ఫోంటేన్‌: అభిమన్యు ఈశ్వరన్‌ (103) శతకంతో రాణించడంతో.. సౌతాఫ్రికా-ఎతో తొలి అనధికారిక టెస్ట్‌లో భారత్‌-ఎ భారీస్కోరు దిశగా  సాగుతోంది. ఓవర్‌నైట్‌ స్కోరు 125/1తో మూడోరోజు ఆటను కొనసాగించిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 308/4 స్కోరు చేసింది. గురువారం ఆట ముగిసేసరికి బాబా అపరాజిత్‌ (19), ఉపేంద్ర (5) క్రీజులో ఉన్నారు. కెప్టెన్‌ ప్రియాంక్‌ పాంచల్‌ (96) సెంచరీ చేజార్చుకోగా.. విహారి (25) విఫలమయ్యాడు. సౌతాఫ్రికా-ఎ తొలి ఇన్నింగ్స్‌ స్కోరు (509/7 డిక్లేర్డ్‌)కు భారత్‌ 201 పరుగుల దూరంలో ఉంది. 

Updated Date - 2021-11-26T10:15:45+05:30 IST