బాక్సింగ్‌లో ఎన్జీ కళాశాల విద్యార్థుల సత్తా

ABN , First Publish Date - 2021-12-03T06:38:39+05:30 IST

మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఇంటర్‌ కళాశాల టోర్నమెంట్‌ బాక్సింగ్‌ పోటీల్లో జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు చెందిన క్రీడాకారులు సత్తాచాటారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో కొనసాగిన బాక్సిం గ్‌ పోటీల్లో బాలుర విభాగంలో కళాశాలకు చెందిన క్రీడాకారులు ఆరు బంగారం, ఏడు రజతం, నాలుగు కాంస్య పతకాలు సాధించారు.

బాక్సింగ్‌లో ఎన్జీ కళాశాల విద్యార్థుల సత్తా
పతకాలు సాధించిన ఎన్జీ కళాశాల విద్యార్థులు

నల్లగొండ క్రైం, డిసెంబరు 2: మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఇంటర్‌ కళాశాల టోర్నమెంట్‌ బాక్సింగ్‌ పోటీల్లో జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు చెందిన క్రీడాకారులు సత్తాచాటారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో కొనసాగిన బాక్సిం గ్‌ పోటీల్లో బాలుర విభాగంలో కళాశాలకు చెందిన క్రీడాకారులు ఆరు బంగారం, ఏడు రజతం, నాలుగు కాంస్య పతకాలు సాధించారు. బాలికల విభాగంలో రెండు బంగారం, రెండు కాంస్య పతకాలు సాధించారు. ఎనిది మంది క్రీడాకారులు ఆలిండియా ఇంటర్‌ యూనివర్సిటీ టోర్నమెంట్‌కు ఎంపికయ్యారు. కాగా, పతకాలు సాధించిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్‌ చంద్రశేఖర్‌, పీడీ కడారి మల్లే్‌షయాదవ్‌ అభినందించారు. 

Updated Date - 2021-12-03T06:38:39+05:30 IST