తైక్వాండోలో ప్రతిభ చూపిన విద్యార్థులకు అభినందనలు
ABN , First Publish Date - 2021-03-02T07:10:53+05:30 IST
తైక్వాండో చాంపియన్షి్ప జిల్లా పోటీలలో చినగంజాం విద్యార్థులు గోల్డ్, ిసిల్వర్ మెడల్స్ సాధించినట్లు తైక్వాండో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి షేక్ అబ్దుల్సలాం చెప్పారు.
చినగంజాం, మార్చి 1 : తైక్వాండో చాంపియన్షి్ప జిల్లా పోటీలలో చినగంజాం విద్యార్థులు గోల్డ్, ిసిల్వర్ మెడల్స్ సాధించినట్లు తైక్వాండో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి షేక్ అబ్దుల్సలాం చెప్పారు. స్థానిక జడ్పీ పాఠశాలలో సోమవారం పాఠశాల హెచ్ఎం రమణకుమార్ అధ్యక్షతన జరిగిన అభినందన సభలో ఆయన మాట్లాడారు. కందుకూరులో ఆదివారం జరిగిన 11వ సబ్ జూనియర్ క్యాడెట్, జూనియర్, సీనియర్స్ బాలబాలకల జిల్లా స్థాయి తైక్వాండో చాంపియన్షి్ప పోటీలలో 9 మంది విద్యార్థులు ప్రతిభ చాటారన్నారు. జూనియర్స్ విభాగంలో షేక్ అబ్దుల్రసూల్, కుంచాల గిరిజారెడ్డి, నాయుడు సూర్యగణేష్, కుంచాల దేవిశ్రీరెడ్డి(గోల్డ్ మెడల్), కొక్కిలిగడ్డ గౌతమి, శేరు వెంకటేశ్వరరావు(సిల్వర్ మెడల్), యల్లంపల్లి ఆనందరావు, అంగలకుదురు స్టీఫెన్బాబు, రాజు హేమంతరెడ్డి(బ్రాంజ్ మెడల్)లు సాధించినట్లు చెప్పారు. వీరిని, శిక్షకులను వాటుపల్లి సుబ్రమణ్యం, షేక్ సుల్తాన్బాషా, కొత్తపాలెం సర్పంచ్ ఆసోది బ్రహ్మారెడ్డి, పాఠశాల హెచ్ఎం. వెంకటరమణకుమార్, ఉపాధ్యాయులు సీతాదేవి, ఎస్ నరసింహారావులు అభినందించారు.