Pawan Kalyan కీలక అస్త్రం.. Jagan Reddy సర్కార్పై మేధోమధనం.. ఆ వ్యాఖ్యలు చిరంజీవి గురించేనా..!?
ABN , First Publish Date - 2021-10-12T19:20:38+05:30 IST
ఆయన మాటలు వారి మనసుల్లో ఆలోచన కలిగించాయా? దాస్య శృంఖలాల్లో ఉన్నామనే ..
ఆయన మాటలు వారి మనసుల్లో ఆలోచన కలిగించాయా? దాస్య శృంఖలాల్లో ఉన్నామనే భావనకు వచ్చేశారా? ఇప్పుడు కాకుంటే మరెప్పుడూ సాధించలేం అనే భావన వారిలో మొదలైందా? చలి చీమలు ఒక్కటై సరిసృపాన్ని చంపినట్లు వేరుపడ్డ అన్నదమ్ములందరూ ఒక్కటయితే కాని లాభం లేదని అనుకుంటున్నారా..? అనే విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్సైడ్లో చూద్దాం.
అస్త్రమేంటి..!?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఆంధ్రప్రదేశ్ కుల రాజకీయాలపై సంధించిన అస్త్రంపై బాగానే చర్చ నడుస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలో పవన్ ..శ్రమదాన రాజకీయం శ్రమకు తగ్గ ఫలితమే ఇచ్చినట్లు కనబడుతోందనే మాట వినిపిస్తోంది. జగన్ రెడ్డి ప్రభుత్వం పవన్ పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేయడం..పోలీసులు వ్యవహరించిన తీరుపై జనసేన నేతలకు ఆగ్రహానికి కలిగిస్తే ఇతర పార్టీల్లోని కాపు వర్గం నేతలను మేథోమథనం వైపు దృష్టి సారించేలా చేస్తోందట.