APలో ప్రతీకారం తప్ప.. పాలన లేదు: కూన రవికుమార్
ABN , First Publish Date - 2021-12-15T18:35:10+05:30 IST
ఏబీఎన్ ఎండీ ఆర్కేపై సీఐడీ కేసు పెట్టడాన్ని టీడీపీ నేత కూన రవికుమార్ ఖండించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఏబీఎన్ ఎండీ ఆర్కేపై వెంటనే కేసు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు
శ్రీకాకుళం: ఏబీఎన్ ఎండీ ఆర్కేపై సీఐడీ కేసు పెట్టడాన్ని టీడీపీ నేత కూన రవికుమార్ ఖండించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఏబీఎన్ ఎండీ ఆర్కేపై వెంటనే కేసు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రశ్నించేవారిపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతీకారం తప్ప.. పాలన లేదని మండిపడ్డారు. పరామర్శకు వెళ్తే కూడా కేసులు పెడతారా..? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. మరి ఓదార్పు యాత్ర చేసిన జగన్పై ఎన్ని కేసులు పెట్టాలని కూన రవికుమార్ ప్రశ్నించారు.