మటన్‌ బిర్యానీ

ABN , First Publish Date - 2016-05-30T15:46:50+05:30 IST

కావలసినవి: బాస్మతి రైస్‌- ఒక కేజీ, మటన్‌- ఒక కేజీ, పెరుగు- 200 గ్రాములు, నిమ్మరసం- మూడు టీస్పూన్లు, కారం పొడి- 20 గ్రాములు, ధనియాల పొడి- 30

మటన్‌ బిర్యానీ

కావలసినవి: బాస్మతి రైస్‌- ఒక కేజీ, మటన్‌- ఒక కేజీ, పెరుగు- 200 గ్రాములు, నిమ్మరసం- మూడు టీస్పూన్లు, కారం పొడి- 20 గ్రాములు, ధనియాల పొడి- 30 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 100 గ్రాములు, ఉప్పు- 50 గ్రాములు, గరం మసాలా పొడి- 20 గ్రాములు, రిఫైన్డ్‌ ఆయిల్‌- 100 గ్రాములు, వేగించిన ఉల్లి ముక్కలు (సన్నగా నిలువుగా కోసి.) - 30 గ్రాములు, జీడిపప్పు (వేగించి) - కొద్దిగా, కొత్తిమీర తరుగు - 15 గ్రాములు, పుదీనా తరుగు - 15 గ్రాములు, బిర్యానీ ఆకులు- ఐదు గ్రాములు, డాల్డా లేదా నెయ్యి- 150 గ్రాములు, నీళ్లు- ఐదు లీటర్లు
 
తయారీ: మటన్‌ను ఒక గిన్నెలోకి తీసుకుని అందులో నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, గరం మసాలా, వేగించిన ఉల్లిముక్కలు కొన్ని, పెరుగు, కొత్తిమీర, పుదీనా, ధనియాల పొడి, నూనె వేసి బాగా కలిపి రెండు నుంచి మూడు గంటల పాటు ఉంచాలి. ఆ తర్వాత బాండీ తీసుకుని అందులో నీళ్లు పోయాలి. గరంమసాలా, బిర్యానీ ఆకులు వేయాలి. ఎసరు ఉడుకుపట్టగానే కడిగిపెట్టుకున్న బాస్మతి బియ్యం వేయాలి. బియ్యం సగం ఉడికాక ఎసరు వంపేయాలి.
ఫ్లాట్‌గా ఉన్న గిన్నె తీసుకుని అందులో ముందు నానబెట్టిన మటన్‌ను ఒక పొరలా వేయాలి. ఆ తర్వాత సగం ఉడికిన బియ్యాన్ని వేసి పైన నెయ్యి వేయాలి. ఈ గిన్నెను తవాపై ఉంచాలి. ఇలా చేయడం వల్ల మంట సమంగా తగులుతుంది. సన్నటి మంటమీద ఇరవై నుంచి ఇరవైఐదు నిమిషాలు ఉంచాలి. ఈ గిన్నెను ఒక తవాపై ఉంచి సన్నటి మంట మీద 25 నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తర్వాత గిన్నె మీద మూత పెట్టి ఆవిరి బయటకు రాకుండా గిన్నెను, మూతను కలిపి మైదాతో మూసేయాలి. మండుతున్న బొగ్గులు మూతమీద వేయాలి. 20 నిమిషాల తర్వాత మూతను తీసి కొత్తిమీర, పుదీనా తరుగు, జీడిపప్పు, వేగించిన ఉల్లిపాయ ముక్కలతో అలంకరించి తింటే రుచి అమోఘం అనాల్సిందే

Updated Date - 2016-05-30T15:46:50+05:30 IST