దోస పరాటాలు

ABN , First Publish Date - 2015-08-30T00:22:39+05:30 IST

కావలసిన పదార్థాలు: గోధుమ పిండి - 3 కప్పులు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 1 టీ స్పూను, కారం - 2 టీ స్పూన్లు

దోస పరాటాలు

కావలసిన పదార్థాలు: గోధుమ పిండి - 3 కప్పులు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 1 టీ స్పూను, కారం - 2 టీ స్పూన్లు, దోసకాయ తురుము - రెండు కప్పులు, పెరుగు - 1 టేబుల్‌ స్పూను, నెయ్యి- 2 టీ స్పూన్లు
తయారుచేసే విధానం
పిండిలో కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, నెయ్యి, దోసకాయ తురుము, రుచికి కాస్త ఉప్పు వేసి బాగా కలపాలి. దోసకాయల్లో నీరుంటుంది గనక మళ్లీ నీరు పోయకూడదు. పిండిని ముద్దలా చేసుకుని నానబెట్టాలి. తర్వాత పరాఠాల్లా చేసుకుని పెనం పైన రెండువేపులా నెయ్యితో కాల్చి, వేడి వేడిగా పెరుగు చట్నీతో తింటే చాలా బావుంటాయి. :

Updated Date - 2015-08-30T00:22:39+05:30 IST