రేగీ వడియాలు
ABN , First Publish Date - 2016-12-19T20:33:32+05:30 IST
కావలసిన పదార్థాలు రేగిపండ్లు- పావు కిలో, పచ్చి మిర్చి- ఆరు, బెల్లం తురుము
రేగిపండ్లలో విత్తనాలను తీసేసి గుజ్జు చేసుకుని పక్కనపెట్టుకోవాలి. పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, ఇంగువ, బెల్లం తురుములను మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. దీంట్లో రేగిపండ్ల గుజ్జు కూడా వేసి బాగా కలిపి చిన్నచిన్న అప్పాలుగా చేసుకొని రెండు రోజులు ఎండబెట్టుకోవాలి. అన్నం తినేటప్పుడు వీటిని నూనెలో వేగించుకుంటే చాలా బాగుంటాయి.