పంచామృతం

ABN , First Publish Date - 2015-09-01T17:40:33+05:30 IST

కావల్సినవి: ఉప్పుడు బియ్యం - 1/2 క ప్పు,మొలకెత్తిన గింజలు - 1/4 కప్పు

పంచామృతం

కావల్సినవి: ఉప్పుడు బియ్యం - 1/2 క ప్పు,మొలకెత్తిన గింజలు - 1/4 కప్పు, పాలకూర - 1 కట్ట (సన్నగా తరిగినది),ఉల్లిగడ్డ - 1 చిన్నది (సన్నగా తరిగినది), పచ్చిమిర్చి - 2 (సన్నగా తరిగినవి), క్యారట్‌ - 1 (సన్నగా తరిగినది), లవంగమొగ్గలు - 2, దాల్చినచెక్క - చిన్నది, యాలకులు - 2,ఉప్పు - తగినంత, బిరియాని ఆకు - 1మిరియాలు - 1/2 టేబుల్‌ స్పూన్‌
నూనె - 1/2 టేబుల్‌స్పూన్‌
విధానం :
కడాయిలో నూనెపోసి, లవంగ మొగ్గలు, దాల్చిన చెక్క, యాలకులు, మిరియాలు, బిరియాని ఆకు వేసి చక్కటి వాసన వచ్చేవరకు వేయించండి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేయించండి. పచ్చిమిర్చి, క్యారట్‌, పాలకూర వేసి కలియబెట్టిన తరువాత మొలకెత్తిన గింజలు, బియ్యం (కడిగినవి) వేసి కొద్దిగా కలియబెట్టాలి. తరువాత నీరుపోసి, తగినంత ఉప్పువేసి కుక్కర్‌లో పోసి పది నిమిషాలు ఉడికించితే మీ పంచామృతం తయార్‌. దీన్ని పెరుగుపచ్చడితో కలుపుకుని తిని తరువాత ఒక పండు తింటే మీరు సమతుల్య ఆహారం తిన్నట్టే.

Updated Date - 2015-09-01T17:40:33+05:30 IST