రాజ్మా రైస్‌

ABN , First Publish Date - 2015-09-01T18:11:50+05:30 IST

కావలసిన పదార్థాలు: బాసుమతి బియ్యం - 200 గ్రా., రాజ్మా బీన్స్‌ - 400 గ్రా.,

రాజ్మా రైస్‌

కావలసిన పదార్థాలు: బాసుమతి బియ్యం - 200 గ్రా., రాజ్మా బీన్స్‌ - 400 గ్రా., నూనె - 1 టేబుల్‌ స్పూను, ఉల్లిపాయ - 1, వెల్లుల్లి రేకలు - 2, గరంమసాలా - 1 టీ స్పూను, కొబ్బరిపాలు - 400 గ్రా., ఉప్పు - రుచికి తగినంత, మిరియాలపొడి - అర టీ స్పూను.
తయారుచేసే విధానం: రాజ్మా గింజల్ని ఒక రాత్రంతా నానబెట్టాలి. బియ్యం 30 నిమిషాలు నానబెట్టి నీరు వడకట్టాలి. నూనెలో ఉల్లితరుగు దోరగా వేగించి, బియ్యం, వెల్లుల్లి తురుము, మసాలా, ఉప్పు, కొబ్బరిపాలతో పాటు 200 మి.లీ. నీరుపోయాలి. పదినిమిషాల తర్వాత రాజ్మా గింజలు కలిపి మూతపెట్టాలి. అన్నం 80 శాతం ఉడికిన తర్వాత మంటని బాగా తగ్గించి మగ్గించాలి. వేడి వేడి రాజ్మా రైస్‌తో ఆలూ కుర్మా మంచి కాంబినేషన్‌.

Updated Date - 2015-09-01T18:11:50+05:30 IST