కావలసినవి
నేరేడుపళ్ల ముక్కలు - అరకప్పు (విత్తనాలు తీసేసి), తాజా పెరుగు, పాలు - ఒక్కొక్కటీ ఒక్కో అరకప్పు, చక్కెర - రెండు స్పూన్లు.
తయారీవిధానం
నేరేడు పళ్లను బాగా కడిగి గుజ్జును ముక్కలుగా తరగాలి. వీటితోపాటు పెరుగు, పాలు చక్కెరలను కూడా మిక్సీలో వేసి మెత్తగా అయ్యేవరకూ గ్రైండ్ చేయాలి. నేరేడుపళ్ల స్మూదీ రెడీ.