చేపల పొరుటు
ABN , First Publish Date - 2015-08-30T18:28:03+05:30 IST
కావలసిన పదార్థాలు: (ముళ్లు తక్కువుండి, తల, తోక తీసేసిన) చేప ముక్కలు - 800 గ్రా., ఉల్లి తరుగు - అరకప్పు
కావలసిన పదార్థాలు: (ముళ్లు తక్కువుండి, తల, తోక తీసేసిన) చేప ముక్కలు - 800 గ్రా., ఉల్లి తరుగు - అరకప్పు, వెల్లుల్లి రేకలు - 8, పచ్చిమిర్చి - 6, కరివేపాకు - 4 రెబ్బలు, నూనె - 2
టేబుల్ స్పూన్లు, పసుపు - అర టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, ఆవాలు - అర టీ స్పూను, మినప్పప్పు - అర టీ స్పూను.
తయారుచేసే విధానం: చేప ముక్కల్ని ఆవిరిపై ఉడికించి చల్లారిన తర్వాత ముళ్లు తీసేసి, చేత్తో పొడిపొడిగా చేసి పక్కనుంచాలి. నూనెలో ఆవాలు, మినప్పప్పు, (సన్నగా పొడుగ్గా తరిగిన) వెల్లుల్లి రేకలు, ఉల్లి, పచ్చిమిర్చి తరుగు ఒకటి తర్వాత ఒకటి వేగించి ఉప్పు, పసుపు, కరివేపాకు కూడా వేసి చివర్లో చేప పొడి కలిపి చిన్న మంటపై 10 నిమిషాలు ఉంచాలి. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత కొత్తిమీరతో అలంకరించాలి. ఈ పొరుటును రసమన్నంలో నంజుకున్నా, చపాతీలతో తిన్నా బాగుంటుంది.