చింతపండు సద్ది

ABN , First Publish Date - 2019-10-05T19:24:06+05:30 IST

బియ్యం - 2 కప్పులు, చింతపండు పులుసు - సగం కప్పు, ఎండుమిర్చి - 5, జీలకర్ర, ఆవాలు - పావు టీస్పూన్‌, మినప్పప్పు - ఒక టీస్పూన్‌, సెనగపప్పు - ఒక టీస్పూన్‌,

చింతపండు సద్ది

కావలసినవి
 
బియ్యం - 2 కప్పులు, చింతపండు పులుసు - సగం కప్పు, ఎండుమిర్చి - 5, జీలకర్ర, ఆవాలు - పావు టీస్పూన్‌, మినప్పప్పు - ఒక టీస్పూన్‌, సెనగపప్పు - ఒక టీస్పూన్‌, ఇంగువ - చిటికెడు, పసుపు - పావు టీస్పూన్‌, ఉప్పు - తగినంత, కరివేపాకు - 2 రెబ్బలు, నూనె - 5 టీస్పూన్లు.
 
తయారీవిధానం
 
బియ్యం కడిగి తగినన్ని నీళ్లు పోసి అరగంట నానిన తర్వాత కొద్దిగా పలుకుగా వండి చల్లార్చుకోవాలి. ఒక వెడల్పాటి గిన్నెలో అన్నం తీసుకొని పసుపు, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. మరో చిన్న గిన్నెలో నూనె వేడి చేసి ఇంగువ వేయాలి. అది కరిగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి చిటపటలాడాక పల్లీలు, మినప్పప్పు, సెనగపప్పు, కరివేపాకు వేసి వేగిన చింతపండు పులుసు వేసి చిక్కబడేవరకు ఉడికించాలి. చివరలో కరివేపాకు, కొంచెం బెల్లం వేసి రెండు నిమిషాలు ఉంచి దింపేయాలి. కలిపి ఉంచుకున్న అన్నంలో వేసి బాగా కలియబెట్టి పది నిమిషాల ఉంచితే చాలు. చింతపండు సద్ది రెడీ.

Updated Date - 2019-10-05T19:24:06+05:30 IST