పచ్చిపులుసు

ABN , First Publish Date - 2017-12-16T21:47:00+05:30 IST

చింతపండురసం-రెండు కప్పులు, నూనె-సరిపడినంత, పచ్చిమిర్చి-నాలుగు, నువ్వులు- రెండు టేబుల్‌స్పూన్లు...

పచ్చిపులుసు

కావలసినవి
 
చింతపండురసం-రెండు కప్పులు, నూనె-సరిపడినంత, పచ్చిమిర్చి-నాలుగు, నువ్వులు- రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు-తగినంత, చక్కెర- ఒక టీస్పూను (ఇష్టముంటే), ఉల్లిపాయ- ఒకటి (తరిగి), జీలకర్ర, ఆవాలు- ఒక్కొక్క టీస్పూను, ఎండుమిర్చి- రెండు, పసుపు-ఒక టీస్పూను, కరివేపాకు- ఒక రెబ్బ.
 
తయారీ విధానం
 
చింతపండు రసాన్ని (పలుచగా) తయారుచేసి పక్కనపెట్టుకోవాలి. పాన్‌లో నూనె వేసి అది వేడెక్కిన తర్వాత అందులో పచ్చిమిర్చి వేసి వేగించాలి. తర్వాత నువ్వులు కూడా అందులో వేసి సన్నని మంటపై కొద్దిసేపు వేగించాలి. చింతపండురసంలో ఉప్పు, చక్కెరలు వేసి కలిపి రెడీ పెట్టుకోవాలి. నువ్వులు ఎరుపురంగుకి రాగానే ఉల్లిపాయముక్కల్ని కూడా దానికి కలపాలి. ఆ మిశ్రమాన్ని చింతపండురసంలో వేసి బాగా కలపాలి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పసుపు, కరివేపాకు కలిపిన పోపును నూనెలో వేగించి రసంలో వేస్తే పచ్చిపులుసు రెడీ...

Updated Date - 2017-12-16T21:47:00+05:30 IST