గంగవాయల్ పసంద్
ABN , First Publish Date - 2015-08-30T23:08:24+05:30 IST
కావలసిన పదార్థాలు: గంగవాయల్కూర తరుగు - 250 గ్రా., మైదా - 2 కప్పులు, గుడ్లు - 3, నీరు - కప్పున్నర
కావలసిన పదార్థాలు: గంగవాయల్కూర తరుగు - 250 గ్రా., మైదా - 2 కప్పులు, గుడ్లు - 3, నీరు - కప్పున్నర, బేకింగ్ సోడా - 1 టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, మిరియాలపొడి - అర టీ స్పూను.
తయారుచేసే విధానం: ఒక పాత్రలో గిలకొట్టిన గుడ్లు, మైదా, ఉప్పు, బేకింగ్ సోడా, మిరియాలపొడి, గంగవాయల్కూర తరుగు వేసి కొద్దికొద్దిగా నీరు పోస్తూ ముద్దలా కలుపుకోవాలి. ఈ ముద్దను అరగంట నానబెట్టాలి. తర్వాత అరంగుళం దళసరిగా గుండ్రంగా చపాతీలా చేసి పెనంపైన తక్కువ నూనెతో ఒక మోస్తరు మంటపై కాల్చాలి. కాలుతున్నప్పుడు గాలి సోకకుండా వెడల్పాటి గిన్నె బోర్లిస్తే రొట్టె పొంగుతుంది. రెండువైపులా దోరగా కాల్చి, కత్తితో నాలుగు భాగాలుగా కట్ చేసి టమోటా సాస్తో తింటే చాలా రుచిగా ఉంటాయి.