ఆ రోజు ధోనీని బాగా తిట్టేశా.. వెల్లడించిన ఆశిష్ నెహ్రా

ABN , First Publish Date - 2020-04-06T03:21:16+05:30 IST

తన హెలికాప్టర్ షాట్లతో అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన మిస్టర్ కూల్ ఎమ్ఎస్ ధోనీ గురించి ఓ ఆసక్తికర విషయం బయటపడింది.

ఆ రోజు ధోనీని బాగా తిట్టేశా.. వెల్లడించిన ఆశిష్ నెహ్రా

న్యూఢిల్లీ: తన హెలికాప్టర్ షాట్లతో అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన మిస్టర్ కూల్ ఎమ్ఎస్ ధోనీ గురించి ఓ ఆసక్తికర విషయం బయటపడింది. దీన్ని భారత జట్టు మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా బయటపెట్టాడు. ఇంతకీ అదేంటంటే.. ఓ వన్డే మ్యాచులో క్యాచ్ మిస్ చేసినందుకు ధోనీని నెహ్రా బాగా తిట్టేశాడట. పాకిస్తాన్‌తో 2005లో జరిగిన వన్డే సిరీస్‌లో ఈ ఘటన చోటుచేసుకుందట. ఈ విషయాన్ని గుర్తుచేసుకున్న నెహ్రా..‘అంతకుముందు బంతికే షాహిద్ అఫ్రిదీ సిక్సర్ కొట్టాడు. ఆ తర్వాత బంతికి కీపర్ క్యాచ్ ఇచ్చాడు. కానీ ధోనీ దాన్ని అందుకోలేకపోయాడు. దాంతో కోపం వచ్చి చెడామడా తిట్టేశా’ అని నెహ్రా చెప్పాడు. ఆ తర్వాత ఈ ఘటన గుర్తొచ్చినప్పుడల్లా తప్పు చేశాననిపిస్తుందని అన్నాడు. అయతే ఈ ఘటన జరిగిన తర్వాత కూడా అప్పటి కెప్టెన్ రాహుల్ ద్రావిడ్, ధోనీ తనతో మామూలుగానే ప్రవర్తించారని వెల్లడించాడు.

Updated Date - 2020-04-06T03:21:16+05:30 IST