ఏసీబీ గాలానికి చిక్కిన పోలీస్
ABN , First Publish Date - 2021-09-19T02:02:56+05:30 IST
ఏసీబీ గాలానికి చిక్కిన పోలీస్
బెంగళూరు: సివిల్ వివాదంలో లంచం తీసుకుంటూ పట్టుబడటంతో నగరానికి చెందిన పోలీస్ ఇన్స్పెక్టర్ను అవినీతి నిరోధక శాఖ అధికారులు శనివారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిక్కజల పోలీసు స్టేషన్లో రాఘవేంద్ర ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. ఒక వ్యాపారవేత్త సివిల్ వివాదాన్ని పరిష్కరించాలని ఆయనను కోరారు. వివాదాన్ని పరిష్కరించాలంటే రూ.10లక్షలు లంచంగా ఇవ్వాలని ఇన్స్పెక్టర్ డిమాండ్ చేశారు. ఫలితంగా వ్యాపారవేత్త అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు. ఇన్స్పెక్టర్ తరఫున రాఘవేంద్ర అనే మరో వ్యక్తి రూ. 2లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. వ్యాపారవేత్త రూ.8 లక్షలను ఇప్పటికే చెల్లించారని రాఘవేంద్ర చెప్పడం విశేషం.