నిర్మల్ వైద్య విధాన పరిషత్ కార్యాలయంలో ఏసీబీ దాడులు
ABN , First Publish Date - 2021-08-06T01:48:42+05:30 IST
పట్టణంలోని వైద్య విధాన పరిషత్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు
నిర్మల్: పట్టణంలోని వైద్య విధాన పరిషత్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రూ.8 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ చిక్కారు. మెడికల్ రీయింబర్స్మెంట్ జారీ కోసం రిటైర్డ్ ఉద్యోగిని శ్రీనివాస్ వేధిస్తున్నాడు. దీంతో ఏసీబీ అధికారులను రిటైర్డ్ ఉద్యోగి సంప్రదించాడు. లంచం తీసుకుంటూ పట్టుబడిన శ్రీనివాస్ను రిమాండ్కు తరలించారు.