విజయవాడలో పలుచోట్ల ఏసీబీ సోదాలు
ABN , First Publish Date - 2021-11-30T02:36:02+05:30 IST
విజయవాడ సహా ఏకకాలంలో పలుచోట్ల
విజయవాడ: విజయవాడ సహా ఏకకాలంలో పలుచోట్ల ఏసీబీ సోదాలు చేసింది. సంక్షేమాభివృద్ధి కార్పొరేషన్ ఎండీ బిల్లురి నాగభూషణం ఇంట్లో ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. హైదరాబాద్లోని కావూరి హిల్స్, నిజాంపేట, మోయినాబాద్లో ఫాంహోస్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. విజయవాడ పోరంకిలోని ఆఫీసులో ఏసీబీ తనిఖీలు చేసింది. కుటుంబ సభ్యులకు చెందిన ఇంటి స్థలం, 5 ఇళ్లు, జి+5 ఫ్లోర్ బిల్డింగ్ను ఏసీబీ గుర్తించింది. 3 కార్లు, బైక్, వెండి, బ్యాంక్ బ్యాలెన్స్ సుమారు 5.93 కోట్ల మేర ఉంటుందని అంచనా. దాదాపు 4.34 కోట్ల అక్రమ ఆస్తులను ఏసీబీ గుర్తించింది. దర్యాప్తు అనంతరం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నారు.