కుమురంభీం జిల్లా తహసీల్దారు ఆఫీసులో ఏసీబీ సోదాలు
ABN , First Publish Date - 2020-07-31T20:03:42+05:30 IST
చింతలమానేపల్లి తహసీల్దారు కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు నిర్వహించారు.
కుమురంభీం జిల్లా: చింతలమానేపల్లి తహసీల్దారు కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు నిర్వహించారు. బదిలీ అయిన తహసీల్దారు ఖాజా నియాజోద్దీన్ అవినీతిపై విచారణ జరిపారు. నియజుద్దీన్కు డబ్బులు ఇచ్చిన రైతులు నుంచి వివరాలు సేకరిస్తున్నారు. భూములు పట్టాలు చేసేందుకు రైతుల నుంచి తహసీల్దార్ లక్షలు వసూలు చేశారు. నిన్న రైతులు ఆందోళన చేయడంతో డబ్బులు తిరిగి ఇస్తానని హామీ పత్రాలు రాసిచ్చిన విషయం తెలిసిందే. గతంలోనూ లంచం తీసుకుంటూ తహసీల్దార్ ఏసీబీకి చిక్కారు.