ఇసుక లారీ ఢీకొని యువతి మృతి
ABN , First Publish Date - 2021-10-10T23:59:29+05:30 IST
పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ బస్టాండ్ ప్రాంతంలోఇసుక లారీ ఢీకొని ఓ యువతి మృతిచెందింది. ధర్మారం మండలం దొంగతుర్తికి చెందిన
పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ బస్టాండ్ ప్రాంతంలోఇసుక లారీ ఢీకొని ఓ యువతి మృతిచెందింది. ధర్మారం మండలం దొంగతుర్తికి చెందిన ప్రజ్ఞ (22) అనే యువతి రాఘవాపూర్ బస్టాండ్ వద్ద రోడ్డు దాటుతుండగా మంథని నుంచి ఇసుక లోడ్తో వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రజ్ఞ శరీరం రెండు ముక్కలై అక్కడికక్కడే మృతిచెందింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.