అభివృద్ధి పనులు వేగవంతం చేయండి

ABN , First Publish Date - 2020-12-05T03:47:35+05:30 IST

అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం చేపడుతున్న రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్ర భవన నిర్మాణాలు వేగవంతం చేయాలని కలెక్టర్‌ వినయచంద్‌ అధికారులను ఆదేశించారు.

అభివృద్ధి పనులు వేగవంతం చేయండి
గంధవరంలో భవనాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ వినయచంద్‌

జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ 


 పద్మనాభం/ రూరల్‌, డిసెంబరు 4: అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం చేపడుతున్న రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్ర భవన నిర్మాణాలు వేగవంతం చేయాలని కలెక్టర్‌ వినయచంద్‌ అధికారులను ఆదేశించారు. మండలంలోని గంధవరం గ్రామంలో నిర్మిస్తున్న  రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య ఉప కేంద్ర భవన నిర్మాణాలను ఆయన శుక్రవారం పరిశీలించారు  నిర్మాణంలో వినియెగిస్తున్న ఇనుము, ఇసుక, ఇతర ముడిసరుకుల వివరాలను స్ధానిక ఇంజనీరింగ్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాందేవుపురం ఎస్సీ కాలనీలో పారిశుధ్యం మెరుగుపరచాలని ఎంపీడీవో చిట్టిరాజును ఆదేశించారు. అనంతరం స్థానిక సచివాలయాన్ని సందర్శించి సిబ్బంది పనితీరుపై  సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పీఆర్‌ డీఈ జగదీశ్‌, ఏఈ సుధాకర్‌, తహసీల్దార్‌ ఎ.శ్రీనివాసరావు, ఎంపీడీవో చిట్టిరాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-05T03:47:35+05:30 IST